చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీ మృతి!
హైదరాబాద్: చర్లపల్లి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీ అనుమానస్పద స్థితిలో మరణించాడు. బాధితుడిని అసోంకు చెందిన ముకుల్ పుల్ వాల్ గా గుర్తించారు.
గత వారం రోజుల్లో ఐదుగురు ఖైదీలు మృతి చెందడంతో జైలు అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. ఐదుగురు ఖైదీలు మృతిచెందడంపై అధికారులు వివరణ ఇవ్వడానికి అందుబాటులోకి రాలేదు.