ప్రారంభమైన ఆర్‌ఎస్‌ఎస్‌ సమావేశాలు


హైదరాబాద్‌: నగరంలోని అన్నోజీగూడలో ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారత కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలను మోహన్‌ భగవత్‌, భయ్యాజీ జోషి ప్రారంభించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సమావేశాలకు 400 మందికిపైగా ప్రతినిధులు హాజరయ్యారు. అన్నోజీగూడలో ఆర్‌ఎస్‌ఎస్‌ సమావేశాలు మూడు రోజులపాటు జరుగనున్నాయి.



ఈ సమావేశాల సందర్భంగా వివిధ అంశాలపై చర్చించనున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు రాత్రికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్‌ రానున్నారు. రేపు, ఎల్లుండి సమావేశాల్లో అమిత్‌ షా పాల్గొననున్నట్టు సమాచారం.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top