నేటి నుంచి చిరుధాన్యాల ప్రదర్శన


సాక్షి, హైదరాబాద్: తెలంగాణ చిరుధాన్యాల ప్రదర్శన నేటి నుంచి ప్రారంభం కానుంది. నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో శుక్రవారం (ఈ నెల 27) నుంచి మార్చి ఒకటి వరకు జరిగే ఈ ప్రదర్శన ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరగనుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ వ్యవసాయ శాఖ సమన్వయంతో ఈ ప్రదర్శన జరగనుంది. దీన్ని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభిస్తారు.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top