డిసెంబర్‌ 22నుంచి శీతాకాల విడిది

డిసెంబర్‌ 22నుంచి శీతాకాల విడిది - Sakshi


రంగారెడ్డి జిల్లా : రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శీతాకాల విడిది ఖరారైంది. డిసెంబర్ 22 నుంచి 31వ తేదీ వరకు ఆయన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఉంటారు.



శీతాకాల విడిదిలో భాగంగా వారం రోజుల పాటు బొల్లారంలో బస చేయనున్నారు. ఈ విడిదిలో ఒక రోజు తిరువనంతపురం, మైసూరులో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ మేరకు ప్రణబ్ పర్యటన షెడ్యూల్‌ను రాష్ట్రపతి భవన్ ఖరారు చేసింది. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర యంత్రాంగాన్ని ఆదేశించింది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top