రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం


హైదరాబాద్‌: విద్యుత్ ఫీడర్ల పరిధిలో మరమ్మతు పనుల కారణంగా బుధవారం పలు బస్తీలలో విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్న చార్మినార్ సీబీడీ ఏడీఈ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జంజం హోటల్, గులాబ్ షా మజీద్, పర్దా గేట్, వట్టేపల్లి తదితర బస్తీల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. అలాగే మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు ఫలక్‌నుమా, రైతుబజార్, బస్సు డిపో, ఇంజన్ బౌలి తదితర బస్తీలలో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామన్నారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫాతీమానగర్, గుంటల్ షా దర్గా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని ఏడీఈ వివరించారు.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top