కేసీఆర్ తీరువల్లే వివాదాస్పదం

కేసీఆర్ తీరువల్లే వివాదాస్పదం - Sakshi


టీపీసీసీ చీఫ్ పొన్నాల



సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు వ్యవహరిస్తున్న తీరువల్లే మెట్రో రైలు నిర్మాణం వివాదాస్పదమైందని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. పరిస్థితిని వివరించిన ఎల్‌అండ్‌టీ సంస్థ ప్రతినిధులపైనా, కథ నాలు రాసిన మీడియాను బ్లాక్‌మెయిల్‌తో లొంగదీసుకోవాలనే విధంగా కేసీఆర్ వైఖరి ఉందని ఆరోపించారు.



ఏ కార్యక్రమం చేపట్టినా కొన్ని సమస్యలు వస్తుండడం సర్వసాధారణమని, అయితే ఎప్పటికప్పుడు సమావేశమై వాస్తవాలను తెలుసుకుని వాటిని అధిగమించడం పాలకుల బాధ్యతని అన్నారు. పాలకుల్లో పట్టుదల, అంకితభావం ఉండాలని, కేసీఆర్‌లో మాత్రం అవి కనిపించడం లేదని విమర్శించారు. టీపీసీసీ కిసాన్‌సెల్ ఛైర్మన్ ఎం.కోదండరెడ్డి, అధికార ప్రతినిధులు కొనగాల మహేష్, ప్యాట రమేశ్ మాట్లాడుతూ, మెట్రో రైలు నిర్మాణంలో సీఎం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. 12 వేల కోట్ల రూపాయల అంచనాతో ప్రారంభమైన మెట్రో నిర్మా ణ వ్యయం 20 వేల కోట్లకు చేరేలా ఉందంటే అందుకు కేసీఆరే కారణమని దుయ్యబట్టారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top