క్రికెట్ బెట్టింగ్: నలుగురి అరెస్టు


హైదరాబాద్: నగర శివారులోని రాయదుర్గంలో క్రికెట్ బెట్టింగ్ స్ధావరాలపై బుధవారం పోలీసులు దాడులు నిర్వహించారు. క్రికెట్ బెట్టింగ్ జరుగుతుందనే సమాచారంతో తనిఖీలు చేపట్టిన పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 7 లక్షలు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి, నిందితులను స్టేషన్ కు తరలించారు.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top