జీడిమెట్లలో విషవాయువులు


జీడిమెట్ల చింతల్ పారిశ్రామి ప్రాంతంలో విషవాయువు వ్యాపించింది. దాంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రంగానగర్ కాలనీ ప్రాంతంలో ఏదో పరిశ్రమ నుంచి చాలా ఘాటైన వాసనతో కూడుకున్న విషవాయువు వ్యాపించింది. దాంతో ఆ ప్రాంత వాసులు కళ్లమంటలతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.



అయితే అధికారులు మాత్రం ఈ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని ఈ ప్రాంత వాసులు ఆరోపిస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతంలో తరచు ఘాటైన వాసనతో ఏవో వాయువులు వస్తూనే ఉంటాయని, ఈసారి మాత్రం దాని తీవ్రత ఎక్కువగా ఉందని స్థానికులు తెలియజేశారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top