సూపర్ మార్కెట్లో ప్లాస్టిక్ బియ్యం

సూపర్ మార్కెట్లో ప్లాస్టిక్ బియ్యం - Sakshi


నగరంలోని ఎల్బీనగర్  పోలీస్ స్టేషన్ పరిధిలో హైటెక్ మోసం వెలుగుచూసింది. బండ్లగూడకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి బండ్లగూడ మెయిన్ రోడ్డులో ఉన్న ఓ సూపర్ మార్కెట్ నుంచి ఆదివారం 25 కేజీల బియ్యం బస్తాను కొనుగోలు చేశాడు. అయితే ఇంటికి వెళ్లి అన్నం వండి చూసి నిర్ఘాంతపోయాడు.



గిన్నెలో అన్నానికి బదులు ప్లాస్టిక్ రేపర్ ఉండటంతో.. అవాక్కయిన శ్రీనివాస్ ఆ బియ్యం బస్తాతో సూపర్ మార్కెట్ వద్దకు చేరుకొని సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. బియ్యానికి బదులు ప్లాస్టిక్ బియ్యం ఇచ్చినందుకు సూపర్ మార్కెట్  ముందు ఆందోళన చేశాడు.




 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top