రేషన్‌లో ఈ-పాస్: మంత్రి సునీత


సాక్షి, హైదరాబాద్: 2015లో రాష్ట్ర పౌరసరఫరాల వ్యవస్థను మరింత సమర్థంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, అందులో భాగంగా రూ.100 కోట్లతో నిత్యావసర సరుకుల సరఫరాలో ఈ-పాస్ విధానం ప్రవేశపెడుతున్నామని రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. శనివారం సచివాలయంలో సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ముద్రించిన టేబుల్ క్యాలండర్, శాఖా సమాచారంతో కూడిన డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ-పాస్ మిషన్ల కొనుగోలుకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయిందన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top