ఉస్మానియా ఆస్పత్రి తరలింపుపై హైకోర్టులో పిల్


హైదరాబాద్ : ఉస్మానియా ఆస్పత్రి తరలింపు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్ను స్వీకరించిన కోర్టు మంగళవారం విచారణ చేపట్టనుంది. ఉస్మానియా ఆస్పత్రి పాత భవనం ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవటంతో  ఆ భవనాన్ని తొలగించేందుకు సర్కారు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు రోగులను కూడా ఇతర ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఆ తర్వాత ఆ భవనాన్ని తొలగించి ఆ స్థానంలో 20 అంతస్తులతో అత్యాధునిక ఆసుపత్రి నిర్మిస్తారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది.
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top