వ్యక్తి అనుమానాస్పద మృతి
ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ ఘటన నగరంలోని కుత్బుల్లాపూర్లో శనివారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. శ్రీను(42) అనే వ్యక్తి పెయింటర్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే కుత్బుల్లాపూర్లోని శ్రీవెంకటేశ్వర వైన్స్ పక్కన ఉన్న సెల్లార్లో శ్రీను మృతదేహం ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.