గాంధీ ఆస‍్పత్రి పైనుంచి దూకి రోగి ఆత‍్మహత‍్య


సికింద్రాబాద్: నగరంలోని గాంధీ ఆస్పత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రి భవనంపై నుండి దూకి ఓ రోగి ఆదివారం ఉదయం ఆత్మ హత్య చేసుకున్నాడు.



న్యూరాలాజి వార్డు లో చికిత్స పొందుతున్న మహబూబ్ నగర్ కు చెందిన గిరి ఆదివారం ఉదయం ఆస‍్పత్రి భవనంపైకి ఎక్కి అక‍్కడి నుంచి దూకాడు. దాంతో అతను అక‍్కడికక‍్కడే మృతిచెందాడు. మానసికస్థితి సరిగాలేనందువల‍్లే అతను ఆత‍్మహత‍్య చేసుకున‍్నట్లు చెబుతున్నారు. సంఘటన స‍్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top