హజ్ యాత్రికులకు సత్వరమే పాస్‌పోర్ట్‌లు


హైదరాబాద్ : హజ్ యాత్రికులకు త్వరితగతిన పాస్‌పోర్టులను జారీ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రాంతీయ పాస్ పోర్టు అధికారిణి ఎస్. అశ్విని హమీ ఇచ్చారు. బుధవారం హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్‌ఎం షుకూర్ పాస్‌పోర్ట్ అధికారిని కలిశారు. ఈ సందర్భంగా ఆమె పై హామీ ఇచ్చారు. పోలీసు క్లియరెన్స్ నివేదిక అందిన వెంటనే పాస్‌పోర్టులు జారీ చేసే విధంగా ఆదేశించామని చెప్పారు.


హజ్‌యాత్ర-2016 కోసం దరఖాస్తు చేసుకునేందుకు తక్కువ సమయం ఉండటంతో వెంటనే పాస్‌పోర్టు పరిశీలన పూర్తి చేసి జారీ చేయాలని అధికారి అశ్వినికి... ఎస్‌ఎం షుకూర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ పాస్‌పోర్టు అధికారి మదన్ మోహన్, హజ్ కమిటీ ఏఈవో ఇర్ఫాన్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top