మియాపూర్లో భారీగా డ్రగ్స్ స్వాధీనం
హైదరాబాద్: నగరంలోని మియాపూర్ మక్త మహబూబాబపేటలో పెద్ద ఎత్తున మత్తుమందు స్వాధీనం చేసుకున్నారు. మత్తు మందు తరలిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వారి వద్ద నుంచి కిలోన్నర ఓపీఎం డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.