అత్తాపూర్లో రోడ్డుప్రమాదం..ఒకరి మృతి


హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లే మార్గంలో శనివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఒక యువకుడు చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.



అత్తాపూర్‌లోని పిల్లర్‌ నంబర్-176 సమీపంలో ఉండే ప్రణయ్‌కాంత్‌రెడ్డి, అతని మిత్రుడు దర్శిసింగ్ బైక్‌పై ఎయిర్‌పోర్టుకు వెళుతున్నారు. విమానాశ్రయం ప్రధాన రహదారిలో వారి వాహనం అదుపుతప్పి కల్వర్టులోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన దర్శిసింగ్ అక్కడికక్కడే చనిపోయాడు. తీవ్రంగా గాయపడిన ప్రణయ్‌కాంత్‌రెడ్డిని వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top