పోలీసులపై నైజీరియన్ల దాడి
నైజీరియన్లు హైదరాబాద్ నగరంలో మళ్లీ రెచ్చిపోయారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్న ఎస్ఐ మీద దాడిచేశారు. అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత టోలిచౌకి ఎస్ఐ బాలకిషన్ గౌడ్ బృందం లంగర్హౌస్ బాపూఘాట్ ప్రాంతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేస్తోంది. అంతలో అటుగా కారులో వచ్చిన ముగ్గురు నైజీరియన్లు ఎస్ఐ మీద దాడికి పాల్పడ్డారు. కారు ఆపమన్నందుకు దాడి చేశారు.
వాళ్లను పట్టుకోబోతుండగా ఇద్దరు పారిపోయారు. మరొకరిని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలోనూ ఇలా పోలీసులపై నైజీరియన్లు దాడిచేసిన సందర్భాలున్నాయి. వీసా గడువు ముగిసినా కూడా అక్రమంగా నివాసం ఉంటున్న నైజీరియన్లు పలు రకాల మోసాలకు కూడా పాల్పడుతున్నారు. గతంలో కొందరిని అదుపులోకి తీసుకున్నా, వాళ్లను శిక్షించడానికి కుదరడంలేదు. వారిని నైజీరియన్ చట్టాల ప్రకారమే విచారించాల్సి రావడంతో పోలీసులు కూడా కఠినంగా వ్యవహరించలేక పోతున్నారు.