టుడే న్యూస్ అప్ డేట్స్


ఢిల్లీ : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై నేడు ప్రకటన చేయనున్న అఖిలేష్ యాదవ్.



హైదరాబాద్ : నేటితో తెలంగాణ అసెంబ్లీ,  శాసన మండలి సమావేశాలు ముగియనున్నాయి. శాసనసభ, మండలిలో ఎస్సీ, బీసీ, మైనార్టీ సంక్షేమంపై చర్చ.

హైదరాబాద్ : నేడు ఎన్టీఆర్ 21వ వర్ధంతి. ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించనున్న ఎన్టీఆర్ కుటుంబసభ్యులు.

తెలంగాణ : తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ్టి నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. 10 రోజుల పాటు దక్షిణ కోరియా, జపాన్ దేశాలలో పర్యటిస్తారు.

 

ఆంధ్రపద్రేశ్ : చిత్తూరు జిల్లాలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నేడు పర్యటించనున్నారు. తిరుపతి స్విమ్స్ లో డయాలసిస్ బ్లాక్‌ను ఆయన ప్రారంభిస్తారు.

ఆంధ్రప్రదేశ్ : నేడు ఏపీ కాంగ్రెస్ కో ఆర్డినేషన్ కమిటీ విజయవాడలో సమావేశం కానుంది. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఎస్‌బీఐ జోనల్ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ మహాధర్నా.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top