గవర్నర్‌కి కొత్త మేయర్‌ వెరైటీ గిఫ్ట్‌!

గవర్నర్‌కి కొత్త మేయర్‌ వెరైటీ గిఫ్ట్‌!


హైదరాబాద్‌: సాధారణంగా పెద్ద హోదాలో ఉన్న వ్యక్తులను కలిసేందుకు వెళ్లినప్పుడు వారికి గౌరవ సూచకంగా పుష్పగుచ్ఛాలు అందించడం పరిపాటే. కానీ గ్రేటర్ హైదరాబాద్ మేయర్‌ గా తాజాగా బాధ్యతలు చేపట్టిన బొంతు రామ్మోహన్‌ మాత్రం కాస్తా వెరైటీ కానుకను అందించారు. బోకేకు బదులు ఆయన ఓ చిన్ని మొక్కను గవర్నర్‌ నరసింహాన్‌కు అందించారు.



ఆ చిన్ని మొక్కను ఆప్యాయంగా తీసుకున్న గవర్నర్ నరసింహన్‌ బొంతు రామ్మోహన్‌ను అభినందించారు. జీహెచ్‌ఎంసీ మేయర్‌గా, డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన సందర్భంగా బొంతు రామ్మోహన్‌, బాబా ఫసియుద్దీన్ శనివారం మర్యాదపూర్వకంగా గవర్నర్‌ను కలిశారు. వారిని అభినందించిన నరసింహన్‌ హైదరాబాద్ నగరాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని, పచ్చని నగరంగా భాగ్యనగరాన్ని తీర్చిదిద్దాలని సూచించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top