అంబేడ్కర్ వర్సిటీలో కొత్త పీజీ కోర్సు


హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఎంఏ మాస్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కోర్సు కొత్తగా అందుబాటులోకి వచ్చింది. ఈ రంగంలో విస్తృతమైన ఉపాధి అవకాశాలు ఉండడంతో ఈ కోర్సును తీసుకొచ్చారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలు పొందేందుకు అవకాశం కల్పించారు. ఇంగ్లిష్ మీడియంలో ఉన్న ఈ కోర్సుకు ఏదేని డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు. దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్ 8 గడువుగా నిర్ణయించారు. మరిన్ని వివరాలు వర్సిటీ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top