ఓబులేసుకు డిసెంబర్ 5 వరకూ రిమాండ్


హైదరాబాద్ : కేబీఆర్ పార్క్ వద్ద కాల్పుల ఘటన కేసులో నిందితుడు ఓబులేసును పోలీసులు శనివారం నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. విచారణ చేపట్టిన కోర్టు అతనికి డిసెంబర్ 5 వరకూ రిమాండ్ విధించింది. అనంతరం ఓబులేసును పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. మరోవైపు ఓబులేసును తమ కస్టడీకి ఇవ్వాలంటూ బంజారాహిల్స్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top