ఓ వర్గం ఓట్ల కోసమే...
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకంలో టెండర్లు కొందరికి అనుకూలంగా ఉన్నాయని నాగం జనార్దన రెడ్డి ఆరోపించారు. కాంట్రాక్టర్లలో ఒక్కరు తప్ప అందరూ ఆంధ్రావాళ్లేనని ఆయన తెలిపారు.
తెలంగాణ చరిత్రలో కీలకమైన సెప్టెంబర్ 17కు ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుడు నిర్వచనం ఇస్తున్నారని విమర్శించారు. ఓ వర్గం ఓట్ల కోసమే తెలంగాణ విమోచన దినం అధికారికంగా నిర్వహించడం లేదని ఆరోపించారు. కేసీఆర్ తన తుగ్లక్ నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఖాసీం చంద్రశేఖర్ రజ్వీలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిడపడ్డారు.
సంబంధిత వార్తలు