కిట్టాపూర్ వద్ద సీసీటీవీకి..
► కర్ణాటకలోని ఈ ప్రాంతంలోనే సీసీటీవీ ఫుటేజీకి
చిక్కిన ‘ముత్తూట్’దొంగల కారు
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ రాంచంద్రపురం ఠాణా పరిధిలో ‘ముత్తూట్ భారీ దోపిడీ’కి పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే గ్రేహౌండ్స్, టాక్టికల్ వింగ్లతో కూడిన 16 బృందాలు కర్ణాటకను జల్లెడ పడుతున్నాయి.
(చదవండి : ‘ముత్తూట్’లో ఘరానా దోపిడీ)
నిందితులు వెళ్లిన ఏపీ23ఎం 3107 నంబర్ కారు కర్ణాటకలోని సెడామ్ నుంచి గుల్బర్గా మధ్యలో కిట్టాపూర్ వద్ద చివరిసారిగా సీసీ టీవీ ఫుటేజీకి చిక్కింది. దీంతో నిందితులు కారును ఆ ప్రాంతంలో వదిలేసి కర్ణాటక ఎక్స్ప్రెస్లో బెంగళూరు వెళ్లి ఉంటారన్న అనుమానంతో కొన్ని బృందాలు అక్కడ తనిఖీ చేస్తున్నాయి. సైబరాబాద్ జాయింట్ సీపీ స్టీఫెన్ రవీంద్ర కిట్టాపూర్ చుట్టుపక్కల ప్రాంతాల పోలీసులతో మాట్లాడారు. వారికి నిందితుల ఊహాచిత్రాలను కూడా పంపారు.