చంద్రబాబుకు ముద్రగడ డెడ్‌లైన్

చంద్రబాబుకు ముద్రగడ డెడ్‌లైన్ - Sakshi


ఆగస్టులోగా కాపులను బీసీలలో చేర్చాలని, లేనిపక్షంలో భారీ ఎత్తున ఉద్యమిస్తామని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం హెచ్చరించారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన డెడ్‌లైన్ విధించారు. కాపు ఉద్యమానికి మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఆయన పలువురిని కలుస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డిని, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చిరంజీవిని కలిశారు. మధ్యాహ్నం దాసరి నారాయణరావును, ఆ తర్వాత వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణను, రాత్రి కాంగ్రెస్ నాయకుడు సి.రామచంద్రయ్యను కూడా ముద్రగడ కలుస్తారు.



ముందుగా ఉద్యమానికి మద్దతిచ్చినందుకు రఘువీరాకు కృతజ్ఞతలు తెలిపారు. మంజునాథ కమిషన్ మధ్యంతర నివేదికను 9 నెలల్లోగా తెప్పిస్తామని చంద్రబాబు మాట ఇచ్చారని, ఆ సమయం ఆగస్టుకు పూర్తవుతుంది కాబట్టి అన్నమాట నిలబెట్టుకుని నివేదిక తెప్పించి, అసెంబ్లీలో దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగంలోని 9వ  షెడ్యూలులో ఈ అంశాన్ని చేర్చాలన్నారు. ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ ఇది సాధ్యం కాదని ముద్రగడ చెప్పారు. కాగా.. కాపు రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని, పార్లమెంటులో కూడా అండగా ఉంటుందని రఘువీరారెడ్డి చెప్పారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top