కాళేశ్వరంపై విషం కక్కుతున్న కాంగ్రెస్ : బాల్క సుమన్
ఎంపీ బాల్క సుమన్ మండిపాటు
సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి మాట గిట్టని కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టుపై విషం కక్కుతోందని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు. అభివృద్ధిలో రాష్ట్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయొద్దన్న దుర్బుద్ధి కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోందని విమర్శించారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీశ్కుమార్తో కలసి శుక్రవారం ఆయన టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, వెంగళరావు హయాంలోనే ప్రాణహిత ప్రాజెక్టు ఒప్పందం జరిగితే, లెండి, లోయర్ పెన్గంగ, ప్రాణహిత పనులు ఎందుకు ముందుకు సాగలేదని, ఇచ్చంపల్లి ప్రాజెక్టును ఎందుకు పక్కన పెట్టారని నిలదీశారు.
కాంగ్రెస్ నేతలు ఉత్తమ్కుమార్రెడ్డి, మధుయాష్కీ, జీవన్రెడ్డి, టీ టీడీపీ నేత రేవంత్రెడ్డి అసత్యాలను ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. అన్ని అంశాలను శాస్త్రీయ కోణంలో అధ్యయనం చేసిన తర్వాతనే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రీ డిజైన్ చేశారని పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు