కష్టమే వచ్చిందో.. కర్కశత్వమో!

కష్టమే వచ్చిందో.. కర్కశత్వమో! - Sakshi

ఏం జరిగిందో తెలియదు. ఆ కుటుంబానికి కష్టమే వచ్చిందో.. లేదా ఎవరైనా కర్కశత్వం చూపారో గానీ, ఒక తల్లి, ఇద్దరు అభం శుభం ఎరుగని చిన్నారులు రైలు పట్టాల పక్కన మరణించి పడి ఉన్నారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ నగరంలోని మల్కాజిగిరి రైల్వేస్టేషన్‌ సమీపంలో శనివారం ఉదయం వెలుగుచూసింది. స్టేషన్‌ సమీపంలోని పట్టాలపై గుర్తుతెలియని మహిళతో పాటు ఇద్దరు చిన్నారుల మృతదేహాలు అనుమానాస్పద స్థితిలో పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. 

 

పిల్లలిద్దరూ విశ్వభారతి నర్సింగ్ స్కూల్లో చదువుతున్నారు. పెద్ద అబ్బాయి నాగరాజు ఒకటో తరగతి చదువుతుండగా, చిన్నబ్బాయి సాయితేజ యూకేజీ చదువుతున్నాడు. వాళ్ల తల్లి గౌరమ్మ పుప్పాలగూడ లోని గ్రీన్ స్పేస్ సిగ్మా అపార్టుమెంట్లలో పనిచేస్తున్నట్లు తెలిసింది. ఈ ముగ్గురూ ఎలా, ఎందుకు మరణించారన్న విషయం మాత్రం ఇంకా తెలియలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.


 


 


 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top