మొబైల్ నెట్ బిల్లు రూ.4.61 లక్షలు
గచ్చిబౌలి: మొబైల్ నెట్బిల్లు రూ.4.61 లక్షలు రావడంతో ఓ వినియోగదారుడు లబోదిబో మంటున్నాడు. రెండునెలలకు సంబంధించి లక్షల్లో బిల్లు రావడంతో ఖంగుతిన్నాడు. జీడిమెట్లలో నివాసం ఉంటున్న జయచంద్రరాజు ఓ బ్లేడ్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఇతను బ్లాక్బెర్రీ హ్యాండ్సెట్లో రిలయన్స్ పోస్టు పెయిడ్ సిమ్ వాడుతున్నాడు. కంపెనీ యూఎస్జీ సిమ్లో కొంత కాలంగా ఇంటర్నెట్ వాడుతున్నాడు. ప్రతి నెల రూ.1200 నుంచి నూ.1500 బిల్లు వచ్చేది. అయితే, గత జూలై 1న రూ.2,12,607 , ఆగస్టు 1న రూ.2,49,112 బిల్లు వచ్చింది. దీంతో ఈ నెల 20న సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు రిలయన్స్ కంపెనీ ప్రతినిధులను విచారించగా హ్యాకింగ్ చేసి ఉండవచ్చుననే అనుమానం వ్యక్తం చేశారు. సైబర్ క్రైం ఇన్స్పెక్టర్ రియాజుద్దీన్ బిల్లులను పరిశీలించారు. మెయిల్స్తో పాటు ఫేస్బుక్, ట్విట్టర్, ఆటోమెటిక్ డౌన్లోడ్ తదితర చాలా ఆష్షన్లు ఆన్లో ఉంచారని, దీంతో 24 గంటలు బిల్ పడిందన్నారు. కంపెనీ మోసం చేయలేదని, కంపెనీపై తాము కేసు నమోదు చేయలేమని స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు