వైఎస్ జగన్ను కలిసిన ఎమ్మెల్సీ ఆర్ఎస్ఆర్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్సీ రాము సూర్యారావు(ఆర్ఎస్ఆర్ మాస్టర్) కలిశారు. హైదరాబాద్ లోటస్పాండ్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన జగన్తో భేటీయ్యారు.
ఈ సందర్భంగా రాము సూర్యారావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయని నియోజకవర్గాల్లో మద్దతు ఇవ్వాల్సిందిగా వైఎస్ జగన్ను కోరానన్నారు. తన విజ్ఞప్తికి వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కూడా వైఎస్సార్సీపీ తనకు మద్దతిచ్చిందని చెప్పారు.