మూడు రోజుల పాటు మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన
హైదరాబాద్: తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 29 నుంచి మూడు రోజుల పాటు మలేషియా, సింగపూర్ల్లో పర్యటించనున్నారు.
రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా కేటీఆర్ పర్యటన కొనసాగనుంది. ఈ పర్యటనలో ఆయన పలు కంపెనీల ప్రతినిధులతో భేటీకానున్నారు. గత నెలలో 20 రోజుల పాటు అమెరికాలో కేటీఆర్ పర్యటించిన విషయం తెలిసిందే.