ముంబైకి వెళ్లిన కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ముంబై వెళ్లారు. ముంబైలో పలువురు పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశంకానున్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీతో కేటీఆర్ భేటీకానున్నారు. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు, ప్రాజెక్టుల గురించి చర్చించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయంలో కీలక పాత్ర పోషించిన కేటీఆర్కు అదనంగా మునిసిపల్ శాఖను కేటాయించిన సంగతి తెలిసిందే.