హరితహారానికి మంత్రి కేటీఆర్ విరాళం
హైదరాబాద్: ‘హరితహారం’ కార్యక్రమానికి రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు తన నెల వేతనాన్ని విరాళంగా ఇచ్చారు.
మంగళవారం రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్నను కలసి రూ.3,00,116ను చెక్కు రూపంలో అందజేశారు. ‘హరితహారం’లో స్ఫూర్తి నింపేందుకు వేతనాన్ని విరాళంగా ఇచ్చినట్లు కేటీఆర్ వెల్లడించారు. హరితహారం కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే.