'రైతు పక్షపాతిగా సేవలందించండి'
హైదరాబాద్ : రైతు పక్షపాతిగా సేవలందించాలని భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖల మంత్రి టి. హరీష్రావు గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ సభ్యులను కోరారు. మార్కెట్ కమిటీ పాలక మండలి చైర్మన్ పుటం పురుషోత్తంరావు, వైస్ చైర్మన్ ఎం.వెంకటరాంరెడ్డి, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం జరిగింది.
ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో హరీష్రావు మాట్లాడుతూ... హయత్నగర్ మండలం కొహెడలో 100 ఎకరాల్లో పండ్ల మార్కెట్ నిర్మాణం త్వరలో ప్రారంభించబోతున్నామన్నారు. రాష్ట్రంలో 17లక్షల టన్నుల గోదాములు నిర్మిస్తున్నామని తెలిపారు. హమాలీలకు వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తామని హరీష్రావు చెప్పారు.