మహారాష్ట్ర మంత్రికి హరీశ్రావు ఫోన్..
హైదరాబాద్ : మహారాష్ట్రలో వర్షాలు, వరద పరిస్థితిపై ఆ రాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్కు తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు ఆదివారం ఫోన్ చేశారు. దిగువకు విడుదల చేస్తున్న నీటి వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.
ఈ మేరకు ఇరిగేషన్ శాఖాధికారులను హరీశ్రావు అప్రమత్తం చేశారు. ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, మిడ్ మానేరు, ఎల్ఎండీ, సింగూర్, నిజాంసాగర్ ప్రాజెక్టుల వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని హరీశ్ ఆదేశించారు.