వైద్య విద్యార్థిని ఆత్మహత్య


ఉప్పల్‌ పరిధిలోని మేడిపల్లి పీ అండ్ టీ కాలనీలో నివాసముంటున్న భవాని(22) అనే వివాహిత సోమవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మనస్తాపం చెంది .. రాత్రి అందరూ నిద్రపోతున్న సమంయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.


వరంగల్ జిల్లాకు చెందిన భవాని అదే జిల్లాకు చెందిన దోమల పృద్వీరాజుతో 2014లో వివాహం జరిగింది. భవాని నగరంలోని ఓ వైద్య కళాశాలలో విద్యార్థిని.  కేసు నమోదు చేసుకున్న మేడిపల్లి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.






 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top