'సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాం'


హైదరాబాద్ : రాష్ట్రంలోని కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని నిజామాబాద్ ఎంపీ కె.కవిత స్పష్టం చేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో జరిగిన మేడే వేడుకల్లో ఆమె పాల్గొని... ప్రసంగించారు. సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమంలో కార్మికులు కీలక పాత్ర పోషించారని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తే మాత్రం అడ్డుకుంటామని కవిత తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top