వివాహిత ఆత్మహత్య
మద్యానికి బానిసైన భర్త తరచు గొడవపడుతండటంతో.. మనస్తాపానికి గురైన వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలోని శివాలయ నగర్లో గురువారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న రమణమ్మ భర్త మద్యానికి బానిసై తరచు వేధిస్తుండటంతో.. మనస్తాపానికి గురై ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.