వెంకటస్వామి మృతికి పలువురి సంతాపం
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత జి.వెంకటస్వామి మృతికి పలువురు నేతలు సంతాపం తెలిపారు. ఏపీ, తెలంగాణ నేతలతోపాటు జాతీయ నేతలు కూడా పలువురు సంతాపం తెలిపారు.
సంతాపం తెలిపినవారిలో వైఎస్ఆర్ సీపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి, ఏపీసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నా లక్ష్మయ్య, పీసీసీ మాజీ అధ్యక్షులు డి.శ్రీనివాస్, ఎం.సత్యనారాయణ, పెదపల్లి ఎంపి బాల్క సుమన్ తదితరులు ఉన్నారు.