శీతాకాల సమావేశాల్లోనే ‘ఎస్సీ బిల్లు’ ప్రవేశపెట్టాలి

శీతాకాల సమావేశాల్లోనే ‘ఎస్సీ బిల్లు’ ప్రవేశపెట్టాలి - Sakshi


మంద కృష్ణ డిమాండ్

సాక్షి, హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని ఎమ్మాఆర్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ సంయుక్త ప్రధాన  కార్యదర్శి శివప్రకాశ్‌జీని మంద కృష్ణ శుక్రవారం కలిశారు. ఈ మేరకు ఈయనతో వర్గీకరణ బిల్లుపై చర్చించారు. దళితుల అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా శివప్రకాశ్‌జీ  స్పష్టం చేశారు. ఈ అంశంపై ప్రధానితో చర్చించి త్వరలో పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top