నాలుగు భాషల తారలు దిగివచ్చేవేళ!
హైదరాబాద్: ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్బాబు కుమారుడు హీరో మంచు మనోజ్, ప్రణతిల వివాహానికి నాలుగు భాషలకు చెందిన తారలు హాజరుకానున్నారు. రేపు ఉదయం 9.05 గంటలకు హైటెక్స్లో జరిగే వీరి వివాహానికి ఏడు రాష్ట్రాల గవర్నర్లు, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు.
నాలుగు భాషలకు చెందిన నటీనటులు కూడా ఈ పెళ్లికి తరలివస్తున్నారు. ఈ వివాహానికి రెండు వందల మంది రాష్ట్ర సెక్యూరిటీ సిబ్బందితోపాటు ఏడు వందల మంది ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది పర్యవేక్షిస్తారు.