మేనేజ్మెంట్ కోటా సీట్లు మెడిసెట్ ప్రకారమే భర్తీ


హైదరాబాద్: కాళోజీ హెల్త్ యూనివర్శిటీ పూర్తి కాకపోవడంతో ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ సహకారంతో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) రమణి వెల్లడించారు. బుధవారం హైదరాబాద్లో రమణి మాట్లాడుతూ.. ఈ కౌన్సెలింగ్ పరిశీలించి వచ్చే ఏడాది నుంచి తెలంగాణలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.


తెలంగాణలో మేనేజ్మెంట్ కోటా సీట్లు మెడిసెట్ ప్రకారమే భర్తీ చేస్తామని ఆమె ఈ సందర్భంగా చెప్పారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఇప్పటికే సీట్లు అమ్ముకున్నారని వస్తున్న వార్తలు అవాస్తవమని రమణి పేర్కొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top