చెట్టుపై వేలాడుతున్న మృతదేహం
హైదరాబాద్ : సనత్నగర్ పరిధిలో లోథా అపార్ట్మెంట్ పక్కనున్న చెట్టుపై కరెంటు తీగల మధ్య గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాం వేలాడుతుంది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని కిందకు దించారు.
ఇంతకీ చనిపోయింది ఎవరనేది ఇంకా తెలియరాలేదు. సదరు వ్యక్తి కరెంటు షాక్తో మృతి చెంది ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సంబంధిత వార్తలు