మధుకర్రెడ్డి భార్య ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: ఇటీవల అమెరికాలో ఆత్మహత్య చేసుకున్న యాదాద్రి భువనగిరి జిల్లావాసి మధుకర్ రెడ్డి భార్య స్వాతి ఆత్మహత్యకు యత్నించింది. కొత్తపేట సౌభాగ్య పురంలోని తల్లిదండ్రుల వద్ద ఉంటున్న స్వాతి గురువారం అర్ధరాత్రి హార్పిక్ తాగింది. కొద్దిసేపటి తర్వాత గమనించిన కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటిన వైద్యం నిమిత్తం కొత్తపేట లోని ఓమ్ని హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం ఆమెకు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. మధుకర్రెడ్డి మరణానికి కారణం స్వాతిఅని ఆరోపిస్తూ అతని కుటుంబసభ్యులు స్వాతిపై దాడికి పాల్పడిన విషయం విదితమే.