కార్మికుల సమ్మెకు లారీ, ఆటో యూనియన్ల మద్ధతు
హైదరాబాద్ : నేడు కార్మిక సంఘాలు సమ్మెబాట పట్టాయి. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేఖ విధానాలు అవలం భిస్తోందంటూ కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు 10 కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ట్రేడ్ యూనియన్ల బంద్కు లారీ ఓనర్ల అసోసియేషన్, ఆటో కార్మిక సంఘాలు మద్ధతు ప్రకటించాయి. సమ్మెలో ప్రభుత్వ, ప్రైవేట్, విదేశీ బ్యాంకుల ఉద్యోగులు పాల్గోనున్నట్లు సమాచారం. రహదారి బిల్లును వ్యతిరేఖిస్తూ తెలంగాణలో నేడు సార్వత్రిక సమ్మె ప్రారంభమైంది.