కాంగ్రెస్‌ గురించి మాట్లాడితే పంచ మహాపాతకాలు

కాంగ్రెస్‌ గురించి మాట్లాడితే పంచ మహాపాతకాలు - Sakshi


వారిని చూసి పిల్లలు కూడా అసహ్యించుకుంటున్నారు: కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ గురించి మాట్లాడితే పంచ మహాపాతకాలు చుట్టుకుంటాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. వెయ్యి మంది విద్యార్థుల బలిదానాలకు కాంగ్రెస్‌ నాయకులే కారణమని మండిపడ్డారు. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాంటాక్లారాలో గురువారం నిర్వహించిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ నాయకులను చూసి చిన్న పిల్లలు కూడా అసహ్యించుకుంటున్నారన్నారు.


ప్రాణాలు పణంగా పెట్టి సాధించుకున్న తెలం గాణలో సీఎం కేసీఆర్‌ అద్భుత పాలనను అంది స్తున్నారని కొనియాడారు. నీళ్లతోనే అభివృద్ధి సాధ్యమని బలంగా నమ్మే ముఖ్యమంత్రి, మిషన్‌ కాకతీయతో 46 వేల చెరువులను పునరుద్ధరణ చేపట్టారని గుర్తు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నామన్నారు. ఎన్ని కల మేనిఫెస్టోలో చెప్పినవే కాకుండా, చెప్పని పథకాలను కూడా ప్రవేశపెట్టిన ఘనత తమ పార్టీదే అన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top