ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఎంసెట్ లీక్: కోదండరాం

ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఎంసెట్ లీక్: కోదండరాం - Sakshi


హైదరాబాద్: ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే తెలంగాణ ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీకైందని టీజేఏసీ చైర్మన్ కోదండరాం విమర్శించారు. 'నీట్'పై ముందే నిర్ణయానికి వచ్చివుంటే విద్యార్థులు రెండు పరీక్షలు రాయాల్సిన అవసరం వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు.



శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. కన్వీనర్ ను సస్పెండ్ చేయాలని, మంత్రులు కూడా బాధ్యత వహించాలని అన్నారు. కోర్టు నిర్ణయం వచ్చే వరకు ఆగివుంటే వైస్ ఛాన్సలర్ల నియామకంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి అప్రతిష్ట వచ్చేదికాదని పేర్కొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top