గవర్నర్ తో సీఎం కేసీఆర్ భేటీ
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్తో అత్యవసరంగా భేటీ అయ్యారు. రాజ్భవన్లో ఈ సమావేశం జరుగుతోంది. అంతకు ముందు టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరుగుతుండగా కేసీఆర్ అర్థాంతరంగా రాజ్భవన్కు బయలుదేరిన విషయం తెలిసిందే. కాగా గవర్నర్తో కేసీఆర్... హైకోర్టు విభజన, న్యాయవాదుల ఆందోళన, నగరంలో ఉగ్రవాదుల అరెస్ట్ తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం