కేసీఆర్ తీరువల్లే మెట్రో సమస్యలు: షబ్బీర్ అలీ

కేసీఆర్ తీరువల్లే మెట్రో సమస్యలు: షబ్బీర్ అలీ - Sakshi


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరువల్లే మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి ఎల్అండ్టీ తప్పుకొంటామని చెబుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మండిపడ్డారు. ఆయన తీరువల్లే రాష్ట్రానికి రావాల్సిన 'హీరో' మోటార్ సైకిళ్ల ప్రాజెక్టు కూడా ఆంధ్రప్రదేశ్కు తరలిపోయిందని, తెలంగాణలోని మహేంద్ర ట్రాక్టర్ల యూనిట్ విద్యుత్ సమస్య కారణంగా బెంగళూరుకు తరలిపోయిందని ఆయన చెప్పారు.



రాబోయే మూడేళ్ల వరకూ కరెంట్ కష్టాలు తప్పవని కేసీఆర్ అంటున్నారని, కేవలం ఆయన నిర్లక్ష్య వైఖరి వల్లే పరిశ్రమలు ఇక్కడి నుంచి వేరే రాష్ట్రాలకు తరలిపోతున్నాయని షబ్బీర్ అలీ చెప్పారు. కొత్త ప్రాజెక్టులు ఏవీ తెలంగాణ రాష్ట్రానికి రాకుండా పోతున్నాయని, ఇలాగైతే తెలంగాణ అభివృద్ధి సాధ్యంకాదని ఆయన అన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top