'రైతులు మరణిస్తే కేసీఆర్ పట్టించుకోవడం లేదు'
మెదక్ : కాంట్రాక్టర్ల జేబులు నింపు కార్యక్రమాన్ని టీఆర్ఎస్ చేస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ఆరోపించారు. మంగళవారం మెదక్లో డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ... సింగూరు జలాశయంలో పూడికతీతను పట్టించుకునే తీరిక రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖ మంత్రి హరీష్రావుకు లేదని ఆయన ఆరోపించారు. మెదక్ జిల్లాలో వ్యవసాయ రైతులు మరణిస్తే సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని లక్ష్మణ్ విమర్శించారు.