పొన్నాలకు షాక్

పొన్నాలకు షాక్ - Sakshi


తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు సొంత నియోజకర్గమైన జనగాంలో షాక్ తగిలింది. జనగాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా బరిలో దిగిన బక్క జడ్సన్... తన నామినేషన్ ఉపసంహరించుకు ప్రసక్తే లేదని శుక్రవారం ఆయన హైదరాబాద్లో స్పష్టం చేశారు. తన చేతిలో పొన్నాలకు ఓటమి కాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని బతికించడానికే తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు.


 


వరంగల్ జిల్లాలో పార్టీ కోసం పని చేసిన నేతలను పక్కకు పెట్టి పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ టికెట్లు అమ్ముకున్నారని బక్క జడ్సన్ గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. అలాగే నమ్మిన నేతలను వాడుకుని వదిలేయడం పొన్నాల నైజమని విమర్శించారు. తనలాంటి దళిత నేతలకు చాలామందికి అవమానం జరిగిందన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఏనాడూ పొన్నాల సహకరించలేదన్నారు. పొన్నాలను ఓడించేందుకే ఆయనపై రెబెల్‌గా పోటీచేస్తున్నానని జడ్సన్ తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top