ఇంటిలిజెన్స్ హెచ్చరికతో హైదరాబాద్లో అప్రమత్తం

ఇంటిలిజెన్స్ వర్గాల  హెచ్చరికలతో అప్రమత్తమైన పోలీసులు - Sakshi


హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఉందని ఇంటిలిజెన్స్ హెచ్చరికలు జారీ చేయడంతో నగరంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. దేశంలోని ఏమూల ఏ ఉగ్రవాద చర్య జరిగినా దానికి ఏదో ఓ రంకంగా నగరంతో సంబంధం ఉంటూనే ఉందనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ బోయిన్‌పల్లి పరిధిలోని బాపూజి నగర్‌లో నార్త్‌జోన్ పోలీసులు గురువారం కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహిస్తున్నారు.



నార్త్ జోన్ డీసీపీ సుధీర్ బాబు ఆధ్వార్యంలో 200 మంది పోలీసులతో ఈ కార్డెన్ అండ్ సెర్చ్ చేపడుతున్నారు. ముఖ్యంగా అద్దెకు ఉంటున్న వ్యక్తుల పూర్తి వివరాలు తీసుకోవాలని డీసీపీ అధికారులకు సూచించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top